కామారెడ్డి, వెలుగు: సదాశివనగర్ మండలం మర్కల్ శివారులో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. కామారెడ్డి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు నిజామాబాద్ నుంచి కామారెడ్డికి వస్తుంది.
సదాశివనగర్ మండలం మర్కల్ శివారులోకి రాగానే వెనుక నుంచి లారీ బస్సును ఓవర్ టెక్ చేసే క్రమంలో రాసుకుంటూ వెళ్లింది. బస్సు స్వల్పంగా దెబ్బతినగా డ్రైవర్ వైపు కూర్చున్న పలువురు ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. వీరిని చికిత్స కోసం కామారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
