
రకాల కూరలు వండుకుని తిన్నా... అందులో ఒక్క ముద్దెనా పచ్చడితో తినాలి. అలా తినకుంటే భోజనం చేసినట్టే ఉండదు చాలామందికి. అయితే ఎప్పుడూ చింతకాయ, మామిడికాయ వంటి నిల్వ ఈ రుచి తగలాల్సిందే! పచ్చళ్లే కాకుండా... కొంచెం వెరైటీ పచ్చళ్లు కూడా రుచి చూడాలి. అప్పుడు నోటికే కాదు, మనసుకూ తృప్తిగా ఉంటుంది. మరెందుకు ఆలస్యం... వెరైటీ గా కంది పంచడిని ట్రై చేసేయండి
కంది పచ్చడి తయారీకి కావాల్సినవి:
- కందిపప్పు: ఒక కప్పు
- ఎండుమిర్చి: పన్నెండు
- జీలకర్ర: అర టీస్పూన్ + పావు టీస్పూన్ (పోపుకి)
- వెల్లుల్లి రెబ్బలు : ఏడు
- చింతపండు: కొద్దిగా
- ఉప్పు : సరిపడా
- నూనె : తగినంత
- పసుపు: చిటికెడు
- కరివేపాకు : ఒక రెమ్మ
తయారీ: స్టవ్ పై పాన్ పెట్టి నూనె వేడి చేయాలి. అందులో ఎండుమిర్చి, జీలకర్ర వేగించాలి వాటికి చింతపండు, ఉప్పు, వెల్లుల్లి రెబ్బలు, సరిపడా నీళ్లు చేర్చి మిక్సీలో గ్రైండ్ చేసి పక్కన పెట్టాలి. అదే పాన్ లో కందిపప్పును దోరగా వేగించి, దాన్ని కూడా పొడి చేయాలి. తర్వాత మిక్సీలో గ్రైండ్ చేసుకున్న రెండు మిశ్రమాలను పెద్ద గిన్నెలోకి తీసుకోవాలి. మళ్లీ స్టవ్ వెలిగించి పాన్ పెట్టి నూనె వేడి చేయాలి. జీలకర్ర, ఆవాలు,పసుపు, కరివేపాకు వేయాలి. ఈ పోపును కంది పొడి మిశ్రమంలో వేసి కలపాలి. వేడివేడి అన్నంలో కంది పచ్చడికి నెయ్యి జోడించి తింటే ఆ రుచి అదిరిపోతుంది.