
రోజూ పాత చట్నీ తింటే బోరు కొడుతుంది. అందుకే కొత్త కొత్త రుచుల కోసం జనాలు తెగ సర్చ్ చేస్తున్నారు. కొత్తచట్నీ రుచి కోసం జనాలు వెంపార్లాడుతున్నారు. అందుకే పండు మిర్చితో పుంటికూర పచ్చడి చేస్తే సూపర్ టేస్ట్.. ఇప్పుడు ఈ పచ్చడి తయారీకి ఏమేమి కావాలి.. ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. . .
పుంటికూర – పండు మిర్చితో తయారీకి కావలసినవి
- పండు మిర్చి : అర కిలో
- పుంటికూర ఆకులు: -రెండు కప్పులు
- చింతపండు- :అర కప్పు
- ఉప్పు :సరిపడా
- మెంతుల పొడి: అర టేబుల్ స్పూన్
- నూనె :ఒకటిన్నర కప్పు
- శెనగ పప్పు: -రెండు టీ స్పూన్లు
- జీలకర్ర :రెండు టీ స్పూన్లు
- ఆవాలు: రెండు టీ స్పూన్లు
- వెల్లుల్లి రెబ్బలు : ఎనిమిది
- కరివేపాకు :రెండు రెమ్మలు
- ఎండు మిర్చి : ముప్పావు కప్పు
- పసుపు: చిటికెడు
తయారీ: పండు మిర్చి, పుంటికూరను బాగా కడిగి తడి పోయేవరకు ఆరబెట్టాలి. స్టవ్ వెలిగించి నూనె వేడి చేయాలి. పుంటికూర ఆకులు, చింతపండు వేసి కలపాలి. మిశ్రమం వేగాక వాటిని మిక్సీలో వేసి గ్రైండ్ చేయాలి. పండు మిర్చిని కూడా మిక్సీలో గ్రైండ్ చేసి... దానికి పుంటికూర మిశ్రమాన్ని కలపాలి. అందులో ఉప్పు, మెంతుల పొడి వేసి కలపాలి. నూనె వేడి చేసి జీలకర్ర, ఆవాలు, శెనగ పప్పు, కరివేపాకు, ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు వేసి వేగించి స్టవ్ ఆపేయాలి. నూనె చల్లారాక పుంటికూర మిశ్రమాన్ని వేసి కలపాలి. గాలి దూరని డబ్బాలో ఈ పచ్చడిని నిల్వ చేస్తే... ఏడాది పాటు తాజాగా ఉంటుంది.