బాలీవుడ్ ఫైర్ బ్రాండ్, సంచలన నటి కంగనా రనౌత్(Kangana Ranaut).. ముక్కుసూటి మనిషి.. తనకు నచ్చితే ఏదైనా చేస్తుంది. సంబంధం లేని విషయాలపై కూడా స్పందిస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తుంది.
కంగనా గత చిత్రం తేజస్ ప్రమోషన్లో భాగంగా 'కుటుంబ వ్యవస్థపై నాకు గౌరవం ఉంది. నాకు కూడా పెళ్లి చేసుకోవాలని, ఒక ఫ్యామిలీ ఉండాలనే కోరిక ఉంది. రానున్న ఐదేళ్లలో దాని గురించి ఆలోచిస్తా కానీ..అది పెద్దలు కుదిర్చిన ప్రేమ వివాహమై ఉండాలి..అంటూ చెప్పుకొచ్చిన విషయం తెలిసిందే.
ప్రస్తుతం కంగనా పై వస్తున్న డేటింగ్ రూమర్స్పై స్పందించింది. ఇటీవల జరిగిన అయోధ్య రామమందిర్ ప్రారంభోత్సవంలో కంగన, నిషాంత్ పిట్ఠితో (CEO & Co Founder of- EaseMyTrip) కలిసి దిగిన ఫొటోలు సోషల్ మీడియాలో బయటకు వచ్చాయి. దీంతో వీరిద్దరూ రిలేషన్లో ఉన్నారంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
లేటెస్ట్గా కంగనా తన డేటింగ్ రూమర్స్పై ఇంస్టాగ్రామ్లో స్పందిస్తూ..‘‘దయచేసి డేటింగ్ రూమర్స్ ఆపండి. క్లారీటీ తెలుసుకోకుండా అసత్య ప్రచారాలు చేయకండి. ఇదే నా విన్నపం. ఆల్రెడీ నిషాంత్కి మ్యారేజ్ అయింది. ఆయన తన ఫ్యామిలీతో హ్యాపీగా ఉన్నారు. అనవసరంగా మా మధ్య వార్తలు క్రియేట్ చేయకండి. నేను వేరే వ్యక్తితో డేటింగ్లో ఉన్నా..సరైన టైం కోసం వెయిట్ చేయండి. ఇబ్బంది పెట్టకండి. ఎక్కడైనా ఇద్దరు వ్యక్తులు కలిసి ఫొటోలు దిగినంత మాత్రాన..డేటింగ్ వార్తలు రాస్తూ..వాటి గురించి మాట్లాడుకుంటూ ఉండటం కరెక్ట్ కాదని తెలిపింది.
ప్రస్తుతం కంగనా రనౌత్ నటిస్తున్న చిత్రం ఎమర్జెన్సీ. ఇందులో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ పాత్రను కంగనా పోషిస్తున్నారు. ఈ సినిమాకు ఆమె దర్శకత్వం కూడా వహిస్తున్నారు. ఈ మూవీ జూన్ 14న రిలీజ్ కానుంది.