ఎమర్జెన్సీ మూవీ విడుదల వాయిదా ..

ఎమర్జెన్సీ మూవీ విడుదల వాయిదా ..

విభిన్న కథనాలు ఎంచుకుంటూ బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ప్రేక్షకులను అలరిస్తోంది. అయితే ఈ మధ్యకాలంలో కంగనా రనౌత్ ఎక్కువగా సోలో మెయిన్ లీడ్ పాత్రలలో నటించడానికి మొగ్గు చూపుతోంది. ఈ క్రమంలో కొన్ని సినిమాలకి నిర్మాతగా, సహా నిర్మాతగా కూడా  వ్యవహరిస్తోంది.

కాగా ప్రస్తుతం  కంగనా రనౌత్  బాలీవుడ్ లో ఎమర్జెన్సీ అనే చిత్రంలో మెయిన్ లీడ్ పాత్రలో నటించడమే కాకుండా దర్శకత్వం కూడా వహించింది. కాగా ఎమర్జెన్సీ చిత్రం 1975లో శ్రీమతి ఇందిరా గాంధీ నాయకత్వంలో జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా  తెరకెక్కించారు. కాగా ఈ చిత్రం సెప్టెంబర్ 6వ తారీఖున విడులా కావాల్సి ఉంది. కానీ పలు అనుకోని కారణాలవల్ల విడుదల ఆగిపోయింది.

Also Read :- 18 ఏళ్లు పూర్తి చేసుకున్న సూర్య, జ్యోతికల వివాహ బంధం

అయితే గతంలో నటి కంగనా రనౌత్ నటించిన తలైవి చిత్రం విడుదలై 3 సంవత్సరాలు పూర్తీ చేసుకోవడంతో ఈ విషయంపై తాజాగా ఈ విషయంపై సోషల్ మీడియా మాధ్యమాలలో స్పందించింది. ఇందులో భాగంగా స్వతంత్రంగా జీవించే స్త్రీ ప్రతీరోజు యుద్ధం చెయ్యాల్సి ఉంటుందని అలాగే తనకి ఎలాంటి గుర్తింపుకానీ, ప్రశంశలుకానీ ఉండవని ఎమోషనల్ అయ్యింది.