ఇజ్రాయెల్ పై కంగనా ట్వీట్.. ఇన్ స్టాగ్రామ్ నుంచి బ్యాన్ చెయ్యాలని నెటిజన్ల డిమాండ్

ఇజ్రాయెల్ పై కంగనా ట్వీట్.. ఇన్ స్టాగ్రామ్ నుంచి బ్యాన్ చెయ్యాలని నెటిజన్ల డిమాండ్

ముంబై: బాలీవుడ్ టాప్ హీరోయిన్ కంగనా రనౌత్ మీద మరోమారు నెటిజన్లు విరుచుకుపడ్డారు. ఇజ్రాయెల్, పాలస్తీనా క్రైసిస్ పై కంగనా చేసిన కామెంట్స్ వివాదాస్పదంగా మారాయి. టెర్రరిజం నిర్మూలనలో ఇజ్రాయెల్ కు భారత్ అండగా ఉంటుందనీ..  గాజా మీద ఇజ్రాయెల్ దాడిని సమర్థిస్తూ కంగనా చేసిన పోస్టులపై సోషల్ మీడియాలో చాలా మంది గుస్సా అవుతున్నారు. ఇప్పటికే కంగనాను ట్విట్టర్ బ్యాన్ చేసింది. దీంతో ఆమె తన అభిప్రాయాలను ఇన్ స్తాగ్రామ్ లో పంచుకుంటోంది. అయితే కంగనా పోస్టులు మాత్రం వివాదానికి కేంద్ర బిందువులుగా మారుతున్నాయి. పాలస్తీనా పై ఇజ్రాయెల్ దాడిని ప్రశంసిస్తూ కంగనా పోస్టు పెట్టడం సరికాదని, ఆమెను ఇన్ స్టా నుంచి కూడా నిషేధించాలని కొందరు డిమాండ్ చేస్తున్నారు.