జగన్‌ ఫ్యాక్షనిస్టులా వ్యవహరిస్తుండు : కన్నా లక్ష్మీనారాయణ

జగన్‌ ఫ్యాక్షనిస్టులా వ్యవహరిస్తుండు : కన్నా లక్ష్మీనారాయణ

తాను టీడీపీలో చేరబోతున్నట్లుగా మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ ప్రకటించారు. ఈ నెల 23న గుంటూరులో తనతో పాటుగా చాలా మంది చేరుతారని చెప్పారు. గన్నవరంలో టీడీపీ కార్యాలయం, కార్యకర్తలపై జరిగిన దాడిని కన్నా ఖండించారు. రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతోందన్న కన్నా... ప్రజలు తిరగబడే పరిస్థితులు త్వరలోనే రానున్నాయన్నారు.  జగన్ ఫ్యాక్షన్ సంస్కృతిని పెంచి పోషిస్తున్నారని కన్నా ఆరోపించారు. రాష్ట్రంలో  పోలీస్‌ వ్యవస్థ పూర్తిగా దిగజారిపోయిందని మండిపడ్డారు. కాగా గత కొంతకాలంగా బీజేపీ రాష్ట్ర నాయకత్వంపై అసంతృప్తితో ఉన్న కన్నా లక్ష్మీనారాయణ..ఇటీవలే ఆ పార్టీని వీడారు.