డ్రగ్స్ కేసులో టీవీ యాంకర్ అనుశ్రీ కి నోటీసులు

డ్రగ్స్ కేసులో టీవీ యాంకర్ అనుశ్రీ కి నోటీసులు

డ్రగ్స్ కేసులో ప్రముఖ కన్నడ టీవీ యాంకర్ అనుశ్రీకి మంగళూరు CCB పోలీసులు నోటీసులు జారీ చేశారు.   డ్రగ్స్ రవాణా కేసులో డ్యాన్సర్ కిశోర్ శెట్టిని మంగళూరు పోలీసులు ఇటీవల అరెస్ట్ చేశారు.ఆయన్ని విచారించగా.. అనుశ్రీకి డ్రగ్స్ తో సంబంధం ఉందని చెప్పినట్లు తెలిసింది. అందుకే ఆమెకు పోలీసులు నోటీసులు పంపారు. దీంతో ఈ డ్రగ్స్ సెగ టీవీ ఇండస్ట్రీకి కూడా పాకాయి. అయితే  నోటీసులు అందడంపై అనుశ్రీ స్పందించింది. 10 ఏళ్ల కిందట కిశోర్ శెట్టితో కలిసి డ్యాన్స్ చేశానని.. అంతే తప్ప అతడితో నాకు అంత పరిచయం ఏమీ లేదని తెలిపింది. టీవీ యాంకర్ గా రాణించడంతోపాటు సినిమాల్లోనూ అనుశ్రీ నటిస్తోంది.