100 రోజులకు చేరువలో కంటివెలుగు.. మిగిలిన జిల్లాల్లో కూడా కంటి పరీక్షలు చేస్తాం

100 రోజులకు చేరువలో  కంటివెలుగు.. మిగిలిన జిల్లాల్లో కూడా కంటి పరీక్షలు చేస్తాం

తెలంగాణ ప్రభుత్వం  కంటి వెలుగు కార్యక్రమం విజయవతంగా  నిర్వహిస్తుందని మంత్రి హరీశ్ రావు తెలిపారు.  రాష్ట్ర వ్యాప్తంగా   జనవరి 18 న ప్రారంభించారు.   ఈ కార్యక్రమం ప్రారంభించి వంద రోజులకు చేరుకోబోతుందన్నారు. అవసరమైన ప్రతి ఒక్కరికీ  కంటివెలుగు  పరీక్షలు చేయాలని మంత్రి హరీశ్ రావు అధికారులను ఆదేశించారు. వెంటనే రీడింగ్ గ్లాసెస్ ఇవ్వడంతో పాటు, నిర్దేశించిన సమయంలో ప్రిస్కిప్షన్ గ్లాసెస్ ఇవ్వాలని సూచించారు.  ఇంకా మిగిలిన  జిల్లాల్లో కంటి వెలుగు  పరీక్షలు ఎక్కువగా చేయాలన్నారు. ప్రజలకు ఈ కార్యక్రమంపై  అవగాహన కల్పించి.. కంటి వెలుగును  విజయవంతంగా నిర్వహిస్తున్న వైద్య సిబ్బందికి, సహకరిస్తున్న ఇతర శాఖలు, ప్రజాప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు మంత్రి హరీశ్ రావు.

తెలంగాణ రాష్ట్రంలో ఏ ఒక్క వ్యక్తి కంటి సమస్యతో బాధ పడకూడదని కంటి వెలుగు పథకానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. మారిన జీవన విధానం, వివిధ రకాల పని ఒత్తిళ్ల వల్ల కంటి సమస్యల పై ప్రజలు దృష్టి పెట్టాలని, అవగాహన లోపం వల్ల ఎక్కువ మంది దృష్టి లోపానికి గురవుతున్నందున ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు మార్గదర్శనంలో రెండవ విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని రూపొందించారు. ఇప్పటి వరకు  94 పని దినాల్లో ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా కోటి 60 లక్షల 89 వేల 744 మందికి కంటి పరీక్షలు చేసారు. దృష్టి లోపం ఉన్నవారిని గుర్తించి 22 లక్షల 44 వేల 267 మందికి ఉచితంగా కళ్లద్దాలు, మెడిసిన్స్ అందజేసారు. 15 లక్షల ప్రిస్కిప్షన్ గ్లాసెస్ పంపిణీ చేయడం జరిగింది.

పరీక్షలు చేసిన వారిలో 75లక్షల  62 వేల 259 మంది పురుషులు,  85 లక్షల 06 వేల 175 మంది స్త్రీలు, 11,584 మంది ట్రాన్స్ జెండర్స్ ఉన్నారు. కోటి 20 లక్షల 42 వేల 218 మందికి ఎలాంటి కంటి సమస్యలు లేవని నిర్ధారణ అయ్యింది. మొదటి దఫా కంటి వెలుగు కార్యక్రమంలో కోటి 50 లక్షల మందికి పరీక్షలు చేయగా ఈసారి 94 పని దినాల్లో 10 లక్షలకు పైగా అదనంగా నిర్వహించడం జరిగింది. 12,501 గ్రామపంచాయతీల్లో, 3666 మున్సిపల్ వార్డులలో కంటిపరీక్షలు పూర్తి కాగా, మొత్తంగా ఇప్పటికే 15 జిల్లాల్లో పూర్తయిన స్క్రీనింగ్ పూర్తి అయ్యింది.  ఇంకా మిగిలిన జిల్లా్ల్లో కూడా పూర్తి చేయాలని మంత్రి హరీశ్ రావు అధికారులను ఆదేశించారు.