కారేపల్లి, వెలుగు: మండల కేంద్రంలోని పీఎం శ్రీ మోడల్ స్కూల్ విద్యార్థులు ఎస్జీఎఫ్ 69వ రాష్ట్ర స్థాయి వెయిట్ లిప్టింగ్ పోటీల్లో ప్రతిభ చూపి పథకాలతో పాటు జాతీయ స్థాయికి ఎంపికైనట్లు మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ ప్రేమ్కుమార్ తెలిపారు. హైదరాబాద్ లో జరిగిన రాష్ట్ర స్థాయి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ వెయిట్ లిప్టింగ్ పోటీలలో పల్లవి, ఉదయ్ కిరణ్ జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యారని, వారు మహారాష్ట్రలో జరిగే జాతీయ పోటీల్లో పాల్గొంటారని తెలిపారు.
రాష్ట్ర స్థాయి పోటీల్లో పల్లవీ, ఉదయ్కిరణ్ బంగారు పతకాలు సాధించగా, ఎస్.సాత్విక్, యశస్విని, అమూల్యప్రియ, నిక్షిత, ఎం.భరత్ రజత పతకాలు, పీ.విఘ్నేష్ కాంస్య పతకం సాధించినట్లు వెల్లడించారు. ప్రతిభ చూపిన విద్యార్థులను ప్రిన్సిపాల్ ప్రేమ్కుమార్, పీడీ మోహినుద్దిన్ అభినందించారు.
