
- కరీంనగర్ సీపీ గౌస్ ఆలం
మానకొండూర్, వెలుగు: కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో పట్టుబడిన 133.8 కేజీల గంజాయిని ధ్వంసం చేసినట్లు కరీంనగర్ సీపీ గౌస్ ఆలం బుధవారం తెలిపారు. మానకొండూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని ఈదులగట్టెపల్లి గ్రామంలో డ్రగ్ డిస్పోసల్ కమిటీ ఆధ్వర్యంలో గంజాయిని దహనం చేసినట్లు చెప్పారు. ఆయన వెంట ఏసీపీలు వేణుగోపాల్, విజయ్ కుమార్, ఇన్స్పెక్టర్లు పుల్లయ్య, సంజీవ్, రజినీకాంత్, సిబ్బంది పాల్గొన్నారు.
కరీంనగర్ క్రైం, వెలుగు: నిషేధిత మత్తు పదార్థాల అమ్మకాలపై కఠిన చర్యలు తప్పవని సీపీ గౌస్ ఆలం హెచ్చరించారు. బుధవారం వన్ టౌన్ పరిధిలోని బస్టాండ్, పార్సిల్ ఆఫీసులు, కిరాణా షాపులు, పాన్షాపులు, హాస్టళ్లు, ఇళ్లల్లో తనిఖీలు చేశారు. కార్యక్రమంలో ఎస్సై రాజన్న, డాగ్ హ్యాండ్లర్ కానిస్టేబుల్ శంకర్పాల్గొన్నారు.