కరీంనగర్ లో కొనసాగుతోన్న బదిలీలు

కరీంనగర్ లో కొనసాగుతోన్న బదిలీలు

కరీంనగర్ సీపీ కమలాసన్ రెడ్డిని ట్రాన్స్ ఫర్ చేసింది ప్రభుత్వం. ఆయన్ను  డీజీపీ కార్యాలయానికి అటాచ్ చేశారు. రామగుండం సీపీ సత్యనారాయణను కరీంనగర్ సీపీగా బదిలీ చేసింది సర్కార్. ఇక రామగుండం సీపీగా ఏసీబీ జేడీ రమణకుమార్ ను నియమించింది. హుజూరాబాద్ బై పోల్ తో.. కరీంనగర్ లో వరుస బదిలీలు చేస్తోంది సర్కార్. ఎస్ఐల నుంచి సీఐల వరకు.. తహశీల్దార్ ల నుంచి.. ఆర్డీఓల వరకు అందరినీ ట్రాన్స్ ఫర్ చేసింది. ఈ మధ్యనే కలెక్టర్ శశాంకను బదిలీ చేసి.. కొత్తగా కర్ణన్ ను అపాయింట్ చేసింది ప్రభుత్వం.