అవినీతి కేసులో..కరీంనగర్ పే అండ్ అకౌంట్స్ ఆఫీసర్ అరెస్ట్

అవినీతి కేసులో..కరీంనగర్ పే అండ్ అకౌంట్స్ ఆఫీసర్ అరెస్ట్

కరీంనగర్, వెలుగు: ఫైళ్లు మూవ్  చేసేందుకు కాంట్రాక్టర్లు, ఉద్యోగుల నుంచి డబ్బులు వసూలు చేసిన కరీంనగర్  పే అండ్​  అకౌంట్స్ జేడీ  ఆఫీస్​ సూపరింటెండెంట్  ఈగల మధుసూదన్ ను ఏసీబీ ఆఫీసర్లు సోమవారం అరెస్ట్​ చేశారు. లంచాల వసూళ్ల కోసం ఈ ఆఫీసర్  ప్రత్యేక బ్యాంక్​ అకౌంట్  తీసినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు.

పెండింగ్ లో ఉన్న ఫైళ్లను పరిష్కరించేందుకు, మూవ్  చేసేందుకు ఉద్యోగులు, కాంట్రాక్టర్ల నుంచి లంచాలు తీసుకుంటున్నట్లు ఫిర్యాదులు వచ్చాయి. ఇందుకోసం ఆయన భద్రాద్రి కో ఆపరేటివ్  అర్బన్  బ్యాంక్​లో బినామీ పేరుతో అకౌంట్ ను ఉపయోగించారు.

2022 సెప్టెంబర్  నుంచి 2023 సెప్టెంబర్  వరకు ఈ ఖాతా ద్వారా రూ.14,77,033 లంచాల రూపంలో తీసుకున్నారు. యూపీఐ లావాదేవీల ద్వారా లంచం తీసుకుంటున్నట్లు గుర్తించి సోమవారం ఆయనను అరెస్ట్​  చేసి ఏసీబీ ప్రత్యేక కోర్టులో హాజరుపర్చారు.