అద్దె ఇంటి ఓనర్లకు సర్కారు వార్నింగ్

అద్దె ఇంటి ఓనర్లకు సర్కారు వార్నింగ్

ఇల్లు ఖాళీ చేయాలని ఒత్తిడి చేస్తే కేసులేనన్న కర్ణాటక

బెంగళూరు: అద్దెకు ఉంటున్న డాక్టర్లు, వైద్య సిబ్బందిని ఇళ్లు ఖాళీ చేయాలంటూ ఓనర్లు ఒత్తిడి చేస్తున్నారంటూ వచ్చిన రిపోర్టులపై కర్ణాటక సర్కారు సీరియస్ అయ్యింది. అలాంటివారిపై  క్రిమినల్ చర్యలు తీసుకుంటామని  వార్నింగ్​ ఇచ్చింది. దీనిపై తమకు ఫిర్యాదులు అందాయని, ఇది ప్రభుత్వ అధికారుల  డ్యూటీలను  అడ్డుకోవడమేనని హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్ మెంట్ అడిషనల్ చీఫ్ సెక్రటరీ జావెద్ అఖ్తర్ గురువారం అన్నారు. ఇలాంటి ఘటనలపై కర్నాటక ఎపిడెమిక్ డిసీజెస్ రెగ్యులేషన్స్ -2020 మేరకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లు, బృహత్ బెంగళూరు మహానగర పాలికె (బీబీఎంపీ) కమిషనర్, జాయింట్ కమిషనర్, మున్సిపల్ కార్పొరేషన్ల కమిషనర్లు, ఎస్పీలకు హోంశాఖ ఆదేశాలు జారీ చేసినట్లు చెప్పారు.

For More News..

కరోనాకు విరుగుడు పేషెంట్ల రక్తమే