వీడేం భర్త : రాగి ముద్దలో విషం పెట్టి.. భార్యను చంపేశాడు

వీడేం భర్త : రాగి ముద్దలో విషం పెట్టి.. భార్యను చంపేశాడు

కర్ణాటకలోని చిక్కమగళూరు జిల్లాలో ఓ వ్యక్తి తన అక్రమ సంబంధానికి అభ్యంతరం చెప్పడంతో ఆహారంలో సైనైడ్ పోసి భార్యను హత్య చేశాడనే ఆరోపణలపై పోలీసులు అరెస్టు చేశారు. డిసెంబర్ 13న జరిగిన ఈ ఘటనలో నిందితుడిని దర్శన్‌గా గుర్తించారు. జిల్లాలోని గోనిబీడు పోలీస్ స్టేషన్ పరిధిలోని దేవవృంద గ్రామంలో అతని భార్య శ్వేత తన నివాసంలో శవమై కనిపించింది. పోలీసులు రాకముందే అంత్యక్రియలు నిర్వహించడానికి ప్రయత్నించగా ఆమె తల్లిదండ్రులకు అనుమానం వచ్చింది.

ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం

దర్శన్ తన భార్య హత్యను ఆత్మహత్యగా చిత్రీకరించడానికి ప్రయత్నించాడు. తన భార్య స్వయంగా సిరంజితో విషాన్ని ఇంజెక్ట్ చేసి ఆమె ఆత్మహత్య చేసుకుందని పేర్కొన్నాడు. తర్వాత శ్వేతకు గుండెపోటు వచ్చిందని చెప్పుకొచ్చాడు. కానీ శ్వేతను నిందితుడే హత్య చేసి ఉంటాడని తల్లిదండ్రులు అనుమానించారు. ఫైనల్ గా వచ్చిన పోస్ట్‌మార్టం రిపోర్టులోనూ అది గుండెపోటు కాదని నిర్ధారణైంది.

ఈ కేసులో పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శ్వేత, నిందితుడు కాలేజీ రోజుల్లో ప్రేమించుకుని మూడేళ్ల క్రితమే పెళ్లి చేసుకున్నారు. అయితే, దర్శన్ ఇటీవల తన కార్యాలయంలో ఓ మహిళతో ఎఫైర్ పెట్టుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న శ్వేత అతని ప్రేమికురాలికి ఫోన్ చేసి భర్తతో సంబంధం కొనసాగించవద్దని హెచ్చరించింది. దీంతో కోపోద్రిక్తుడైన నిందితుడు ఆమెను అంతం చేయాలని ప్లాన్ చేశాడు. సమయం చూసి రాగి ముద్దలో సైనైడ్ కలిపి ఆమెకు ఇచ్చాడు. అది తిన్న శ్వేత చనిపోయింది.