రెండు రోజులుగా కర్ణాటక IAS మిస్సింగ్... ప్రభుత్వం రియాక్షన్ ఇది..

రెండు రోజులుగా కర్ణాటక IAS మిస్సింగ్... ప్రభుత్వం రియాక్షన్ ఇది..

కర్ణాటకలో IAS ఆఫీసర్ జ్ఞానేంద్ర కుమార్ గంగ్వార్ రెండురోజులుగా అదృశ్యమవ్వడం కలకలం రేపుతోంది. ఈ అంశంపై క్లారిటీ ఇచ్చారు కర్ణాటక హోమ్ మినిస్టర్ ప్రియాంక్ ఖర్గే. శనివారం ఎక్స్ వేదికగా IAS ఆఫీసర్ అదృశ్యానికి కారణం వివరించారు ఖర్గే. అదృశ్యమైన IAS అధికారిని సంప్రదించామని... ఫామిలీ ఎమర్జెన్సీ కారణంగా అతడు సొంతూరికి వెళ్లాల్సి రావడంతో సెలవుపై వెళ్లారని తెలిపారు ఖర్గే.

ఆయన తన ఆఫీస్ ఫోన్‌లో అందుబాటులో లేరని, దీనివల్ల ఆయన ఆచూకీపై కొంత గందరగోళం నెలకొందని అన్నారు. అప్పటి నుండి ఆయన ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి, పరిస్థితిని వివరించారని అన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం జ్ఞానేంద్ర కుమార్ గంగ్వార్ ఆచూకీ కోసం దర్యాప్తు చేస్తుండగా, ఆయన అదృశ్యమయ్యారని అంతకుముందు వార్తలు వెలువడ్డాయి. ఆయన కుటుంబం నుంచి ఎలాంటి అధికారిక ఫిర్యాదు అందలేదని, వారు ఆయనతో అన్ని సంబంధాలు కోల్పోయారని ప్రభుత్వం తెలిపింది.

జ్ఞానేంద్ర కుమార్ అదృశ్యం గురించి రెండు రోజుల క్రితం ప్రభుత్వానికి సమాచారం అందిందని ఖర్గే ఇంతకుముందు ఒక ప్రకటనలో తెలిపారు. ఇప్పటివరకు అధికారి కుటుంబం గానీ, ఇతరులు గానీ ఎలాంటి అధికారిక ఫిర్యాదు దాఖలు చేయలేదని ఖర్గే తెలియజేశారు. ప్రభుత్వం అతనితో అన్ని రకాల సంబంధాలను కోల్పోయిందని కూడా ఆయన అన్నారు.జ్ఞానేంద్ర కుమార్ చివరిసారిగా బెంగళూరు విమానాశ్రయంలో కనిపించారని ఖర్గే కూడా చెప్పారు.