
కరోనా వైరస్ వ్యాప్తి కేసుల సంఖ్య తగ్గడంతో రాష్ట్రవ్యాప్తంగా అమల్లో ఉన్న రాత్రి కర్ఫ్యూను ఎత్తివేస్తున్నట్టు కర్ణాటక ప్రభుత్వం శుక్రవారంనాడు ప్రకటించింది.ప్రతి రోజు రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకూ అమలు చేస్తున్న కర్ఫ్యూను ఉపసంహరించుకుంటున్నట్టు చీఫ్ సెక్రటరీ పి. రవి కుమార్ ఆదేశాలు జారీ చేశారు. తక్షణమే ఈ ఆదేశాలు అమల్లోకి వచ్చినట్టు తెలిపారు. అంతేకాదు హార్స్ రేసింగ్కు కూడా తిరిగి అనుమతిస్తున్నట్టు చెప్పారు. ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఆదేశాలు, కరోనా నిబంధనలను కఠినంగా పాటించాలని స్పష్టం చేశారు.
వాక్సినేషన్ కవరేజ్ పెరగడం..కరోనా కేసులు తగ్గడంతో కర్ణాటక ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.