హైదరాబాద్, వెలుగు: కే.కేశవరావు కోసం సెక్రటరీ జనరల్ అనే పదవిని క్రియేట్చేసి కేసీఆర్ పక్కన కూర్చోపెట్టుకోవడమే పెద్ద తప్పు అని మాజీ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి కొడుకు కార్తీక్ రెడ్డి అన్నారు. ఎంపీగా చేయడం ఇంకో తప్పు అని చెప్పారు. తెలుగుకూడా రాని కేకే కూతురిని మేయర్ చేయడం మరో తప్పని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీలోకి రంజిత్ రెడ్డి ఎందుకు పోయారో చేవెళ్ల నియోజకవర్గంలో చిన్న పిల్లాడిని అడిగినా చెప్తారని అన్నారు.
చేవెళ్ల సన్నాహక సమావేశంలో కార్తీక్రెడ్డి మాట్లాడారు. సమావేశంలో యాదన్నే స్టార్ స్పీకర్ అని, రామన్న దుమ్ము కూడా దులిపేశారని వ్యాఖ్యానించారు. తాము పార్టీ మారడానికి, రంజిత్రెడ్డి లాంటి వాళ్లు పార్టీలు మారడానికి చాలా తేడా ఉందని కార్తీక్ రెడ్డి అన్నారు. కేసీఆర్కు ఆఖరు వరకు అండగా ఉంటామని తెలిపారు.