కేకేను పక్కన పెట్టుకునుడే కేసీఆర్ చేసిన తప్పు: పటోళ్ల కార్తీక్ రెడ్డి

కేకేను పక్కన పెట్టుకునుడే  కేసీఆర్ చేసిన తప్పు: పటోళ్ల కార్తీక్ రెడ్డి

హైదరాబాద్​, వెలుగు: కే.కేశవరావు  కోసం సెక్రటరీ జనరల్​ అనే పదవిని క్రియేట్​చేసి కేసీఆర్​ పక్కన కూర్చోపెట్టుకోవడమే పెద్ద తప్పు అని మాజీ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి కొడుకు కార్తీక్​ రెడ్డి అన్నారు. ఎంపీగా చేయడం ఇంకో తప్పు అని చెప్పారు. తెలుగుకూడా రాని కేకే కూతురిని మేయర్​ చేయడం మరో తప్పని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్​ పార్టీలోకి రంజిత్​ రెడ్డి ఎందుకు పోయారో చేవెళ్ల నియోజకవర్గంలో చిన్న పిల్లాడిని అడిగినా చెప్తారని అన్నారు.

  చేవెళ్ల సన్నాహక సమావేశంలో కార్తీక్​రెడ్డి మాట్లాడారు. సమావేశంలో యాదన్నే స్టార్​ స్పీకర్​ అని,  రామన్న దుమ్ము కూడా దులిపేశారని వ్యాఖ్యానించారు. తాము పార్టీ మారడానికి, రంజిత్​రెడ్డి లాంటి వాళ్లు పార్టీలు మారడానికి చాలా తేడా ఉందని కార్తీక్​ రెడ్డి అన్నారు. కేసీఆర్​కు ఆఖరు వరకు అండగా ఉంటామని తెలిపారు.