- బిల్డింగ్పై నుంచి దూకిన విద్యార్థిని
- తీవ్ర గాయాలతో దవాఖానలో చేరిక
- పాఠశాలలో చదవడం ఇష్టం లేకనే..
రాయికోడ్, వెలుగు : సంగారెడ్డి జిల్లా రాయికోడ్మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ స్కూల్కు చెందిన ఓ స్టూడెంట్ఆత్మహత్యాయత్నం చేసింది. ఝరాసంగం మండలం ప్యాలారం గ్రామానికి చెందిన దశరథ్, సుజాతల పెద్ద బిడ్డ స్నేహ (14) ఆరో తరగతి నుంచి రాయికోడ్కస్బూర్బా స్కూల్లో చదువుతోంది. సమ్మర్హాలీడేస్తర్వాత స్కూల్మళ్లీ ప్రారంభం కావడంతో సోమవారం ఉదయం స్నేహ తన తల్లిదండ్రులతో కలిసి వచ్చింది.
అయితే, తాను ఇంట్లోనే ఉండి చదువుకుంటానని, ఈ స్కూల్కు వెళ్లనని పేరెంట్స్తో మొండికేసింది. దీంతో వారు ఈ ఒక్క సంవత్సరం చదివితే పదో తరగతి పూర్తవుతుందని నచ్చజెప్పారు.. అయితే తన చెల్లెలు వెంట ఉంటేనే స్కూల్లో చదువుతానని, లేకపోతే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించింది. భయపడ్డ వారు చిన్నకూతురికి 8 వ తరగతిలో సీట్ ఇవ్వాలని స్కూల్లో అడిగారు. ఖాళీలు లేవని చెప్పడంతో అది విన్న స్నేహ తనను ఇక్కడే చదివిస్తారని భయపడి స్కూల్ బిల్డింగ్ ఎక్కి అందరూ చూస్తుండగానే దూకింది. తీవ్రంగా గాయపడిన స్నేహను రాయికోడ్ ప్రభుత్వ దవాఖానకు, అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం జహీరాబాద్ ప్రభుత్వ హాస్పిటల్కు తరలించారు. స్నేహ ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని డాక్టర్లు చెప్పారు.