నేడు తెలంగాణకు మాజీ గవర్నర్ తమిళిసై

నేడు తెలంగాణకు మాజీ గవర్నర్ తమిళిసై

హైదరాబాద్, వెలుగు: బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేసేందుకు తెలంగాణ మాజీ గవర్నర్  తమిళిసై సోమవారం  రాష్ట్రానికి రానున్నారు. పది రోజులకు పైగా ఆమె ఇక్కడే ఉండి ప్రచారం చేయనున్నారు. తమిళనాడు బీజేపీ వలంటీర్లతో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. అయితే, గవర్నర్​గా రిజైన్ చేశాక తొలిసారి రాష్ట్రానికి ఆమె బీజేపీ నేతగా వస్తున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్, బీఆర్ఎస్  నేతలపై ఆమె ఎలాంటి ఆరోపణలు చేస్తారో అందరిలో ఆసక్తి నెలకొంది. ఆదివారం సాయంత్రమే చెన్నై – ఎడుంబూరు రైల్వే స్టేషన్ నుంచి హైదరాబాద్​కు చార్మినార్  ఎక్స్ ప్రెస్​లో ఆమె బయల్దేరారు.

ఇయ్యాల నడ్డా కూడా 

బీజేపీ చీఫ్​ జేపీ నడ్డా కూడా సోమవారం రాష్ట్రానికి రానున్నారు. ఉదయం 11 గంటలకు కొత్తగూడెం, మధ్యాహ్నం 12.30 గంటలకు మహబూబాబాద్​లో జరిగే సభల్లో పాల్గొంటారు. సాయంత్రం 5 గంటలకు హైదరాబాద్ లోని నిజాంపేటలో జరిగే రోడ్ షోలో పాల్గొంటారు.