రాములోరి మీద ప్రేమతో...ఐదువేల అమెరికన్ వజ్రాలతో నెక్లెస్

రాములోరి మీద ప్రేమతో...ఐదువేల అమెరికన్ వజ్రాలతో నెక్లెస్

శ్రీరాముడి మీద భక్తిని ఒక్కొక్కరూ ఒక్కోలా చాటుకుంటున్నారు. సూరత్​కి చెందిన వజ్రాల వ్యాపారి , రసేష్​ జువెల్స్ డైరెక్టర్ కౌశిక్ కాకడియా. ఐదు వేల అమెరికన్ వజ్రాలను వాడి అయోధ్య రామమందిరం థీమ్​తో నెక్లెస్​ తయారుచేయించాడు. ఆ నెక్లెస్​ను అయోధ్యలోని రామ మందిరానికి బహుమతిగా ఇవ్వబోతున్నాడు.

ఈ నెక్లెస్​ను 40 మంది కళాకారులు 35 రోజుల్లో పూర్తి చేశారు. అందుకు ఐదు వేల అమెరికన్ డైమండ్స్​తో పాటు, రెండు కిలోల వెండి వాడారు. ఈ నెక్లెస్​లో అయోధ్య రామమందిరం, సీతారాములు, లక్ష్మణుడు, హనుమంతుడిని చూడొచ్చు. ‘దీన్ని వ్యాపారాన్ని ప్రమోట్​ చేసుకునేందుకు తయారుచేయలేదు. రామ మందిరానికి మనస్ఫూర్తిగా బహుమతిగా ఇవ్వాలని డిజైన్​ చేశాం’ అని చెప్పాడు కౌశిక్.