
కాగజ్ నగర్, వెలుగు: అక్రమంగా తరలిస్తున్న 32 పశువులను కౌటాల పోలీసులు పట్టుకున్నారు. పక్కా సమాచారం మేరకు మండలంలోని హెట్టి గ్రామం సమీపంలో తనిఖీ చేయగా 3 బొలెరో వెహికల్స్ లో 18 ఆవులు,10 దూడలు, 4 ఎడ్లు తరలిస్తుండగా పట్టుకున్నట్లు ఎస్సై విజయ్ తెలిపారు.
వీటిని జగిత్యాల, భైంసాకు రవాణా చేస్తున్నట్లు గుర్తించారు. మూడు వెహికల్స్తోపాటు, 2 కార్లను సీజ్ చేశారు. పశువులను తరలిస్తున్న షేక్ సజీయుద్దీన్, ఎస్కే అయూబ్ ఖాన్, షేక్ హాలిద్ పాషా, జమీర్, షేక్ మోబిన్, అబ్దుల్లా, ఫసి ఉల్ల, అహ్మద్ మీద కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.