ఐదున్నర గంటలుగా కొనసాగుతోన్న కవిత విచారణ

 ఐదున్నర గంటలుగా కొనసాగుతోన్న కవిత విచారణ

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో బీఆర్ఎస్  ఎమ్మెల్సీ కవిత విచారణ కొనసాగుతోంది. సుమారుగా ఐదున్నర గంటలుగా అధికారులు కవితను విచారిస్తున్నారు. రామచంద్ర పిళ్లైతో కలిసి కవితను ఈడీ అధికారులు విచారించారు.  సౌత్ గ్రూప్ లోని వ్యక్తులతో వ్యాపర సంబంధాలపై ఈడీ ఆరా తీసింది. సాయంత్రం ఆరుగంటల వరకు విచారణ కొనసాగే అవకాశం ఉంది. రామచంద్ర పిళ్లై కస్టడీ సమయం నేటితో ముగియడంతో ఆయనను రౌస్ అవెన్యూ కోర్టుకు ఈడీ అధికారులు తరలించారు . కాసేపట్లో ఈడీ న్యాయమూర్తి ముందు పిళ్లైను హాజరుపరుచనున్నారు. మరోవైపు ఇదే కేసులో ఆరెస్ట్ అయిన ఢిల్లీ మాజీ ఉపముఖ్యమంత్రి సిసోడియా కస్టడీని ఏప్రిల్ 3 వరకు పొడిగించారు.