రాహుల్జీ.. కర్ల రాజేశ్తల్లిగోడు కనిపించట్లేదా? : తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత

రాహుల్జీ.. కర్ల రాజేశ్తల్లిగోడు కనిపించట్లేదా? : తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత
  •     తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ప్రశ్న

హైదరాబాద్​, వెలుగు: పోలీస్​ కస్టడీలో మరణించిన దళిత యువకుడు కర్ల రాజేశ్ తల్లిగోడు రాహుల్​ గాంధీకి ఎందుకు కనిపించడం లేదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ప్రశ్నించారు. కాంగ్రెస్​ అధికారంలో ఉన్న తెలంగాణలో దళితులపై జరుగుతున్న దాష్టీకాలపై దృష్టి సారించాలని ఆదివారం ఆమె ‘ఎక్స్’​లో పోస్ట్​ పెట్టారు. కాంగ్రెస్​ ప్రభుత్వం వచ్చి రెండేండ్లు గడిచిందని, రోహిత్​ వేముల చట్టం తీసుకురావడానికి ఇంకా ఎంతకాలం పడుతుందని నిలదీశారు. 

దళితులపై ప్రేమ మాటల్లో కాదు చేతల్లో చూపాలని తెలిపారు. రోహిత్ వేముల చట్టం వెంటనే తీసుకురావాలని డిమాండ్​ చేశారు. కర్ల రాజేశ్​ కుటుంబాన్ని ఆదుకొని న్యాయం చేయాలని కోరారు. రాజేశ్ లాకప్ డెత్​కు కారణమైన ఎస్ఐపై వెంటనే చర్యలు తీసుకునేలా సీఎం రేవంత్​కు తగిన సూచనలు ఇవ్వాలన్నారు.