ఈడీ ఆఫీసుకు కవిత లాయర్లు.. విచారణ సమయంలో వాళ్లెందుకొచ్చారు?

ఈడీ ఆఫీసుకు కవిత లాయర్లు..  విచారణ సమయంలో వాళ్లెందుకొచ్చారు?

ఈడీ ఆఫీసులో విచారణలో ఉన్న ఎమ్మెల్సీ కవిత దగ్గరకు ఆమె లాయర్లు వెళ్లారు. ఢిల్లీలోనే ఉన్న అడ్వకేట్ జనరల్ రామచంద్రరావు, సీనియర్ అడ్వకేట్లు సోమ భరత్, గండ్ర మోహనరావు సాయంత్రం ఐదు గంటల సమయంలో ఈడీ ఆఫీసుకు చేరుకున్నారు. మార్చి 20వ తేదీ ఉదయం 10 గంటల 30 నిమిషాలకు కవిత ఈడీ ఆఫీసులోకి వెళ్లారు. అప్పటి నుంచి విచారణను ఎదుర్కొంటున్నారు. 

ఈడీ ఆఫీసుకు సాయంత్రం సమయంలో సీనియర్ అడ్వకేట్లు చేరుకోవటం ఆసక్తిగా మారింది. అంత హడావిడిగా వారు రావటం ఏంటనే ప్రశ్నలు తలెత్తున్నాయి. లిక్కర్ స్కాం కేసు విచారణకు సంబంధించి ఇప్పటికే తన లాయర్ల కవిత లేఖ కూడా రాశారు. ఇప్పుడు విచారణ జరుగుతున్న సమయంలో వీరు ఆఫీసులోకి వెళ్లటం ద్వారా ఏమై ఉంటుంది అనేది ప్రశ్నగా మారింది. ఈడీ ఆఫీసు ఎదుట భారీగా పోలీసులు మోహరించారు. కార్యకర్తలను చెదరగొడతున్నారు.