
- తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి పర్యాటకుల రాక
- ఆకట్టుకుంటున్న అటవీ అందాలు, వన్యప్రాణులు
- ఫారెస్ట్, టూరిజం డిపార్ట్మెంట్ల ప్రత్యేక ఏర్పాట్లు
మంచిర్యాల, వెలుగు : మంచిర్యాల జిల్లా జన్నారం కేంద్రంగా ఉన్న కవ్వాల్ టైగర్ ఫారెస్టు ఎకో టూరిస్టులను ఆకట్టుకుంటోంది. హైదరాబాద్ సహా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచే కాకుండా ఇతర స్టేట్స్నుంచి కూడా టూరిస్టులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. ఇక్కడి అటవీ అందాలను, రకరాల వన్యప్రాణులను, పక్షిజాతులను చూసి ఫిదా అవుతున్నారు. ఫారెస్ట్, టూరిజం డిపార్ట్మెంట్ల ఆధ్వర్యంలో జంగిల్సఫారీ ఏర్పాటు చేయడంతో పాటు టూరిస్టులకు పలు సౌకర్యాలు కల్పిస్తున్నారు. దీంతో హాలిడేస్ లో పలువురు ఫ్యామిలీతో కలిసి వచ్చి ఎంజాయ్ చేస్తున్నారు.
కనువిందు చేసే అటవీ అందాలు..
కవ్వాల్ టైగర్ ఫారెస్ట్ అంటేనే ప్రకృతి అందాలకు నెలవు. దట్టమైన అడవులు, ఎత్తైన గుట్టలు, కనుచూపుమేరలో ఎటుచూసినా పచ్చదనం పరుచుకుని కనువిందు చేస్తోంది. ఫారెస్ట్డిపార్ట్మెంట్ఆధ్వర్యంలో వన్యప్రాణుల సంరక్షణ కోసం పలుచోట్ల వాచ్టవర్లు నిర్మించారు. జంతువులకు నీటి వసతి కోసం కుంటలు తవ్వారు. వాటిదగ్గర వుడెన్ బ్రిడ్జిలు, కాటేజీలు ఏర్పాటు చేశారు.
కొన్ని చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో గడ్డ క్షేత్రాలను పెంచుతున్నారు. ఈ అడవిలో చుక్కల జింకలు, కోతులు, కొండెంగలు, అడవిపందులు, అడవి దున్నల గుంపులను చూడొచ్చు. ఉదయం, సాయంత్రం వేళల్లో అవి స్వేచ్ఛగా అడవిలో విహరిస్తుంటాయి. అడవి కుక్కలు, చిరుతలు, ఎలుగుబంట్లు వంటి వైల్డ్యానిమల్స్ సైతం అక్కడక్కడా తారసపడుతుంటాయి. సుమారు 300 రకాల పక్షులను కవ్వాల్ఫారెస్ట్లో గుర్తించారు. ఏటా నిర్వహించే బర్డ్వాచ్ఫెస్టివల్కు రాష్ర్టం నలుమూలల నుంచి బర్డ్లవర్స్పెద్ద సంఖ్యలో తరలివస్తుంటారు.
ఆహ్లాదకరంగా సాగే జంగిల్సఫారీ..
ఫారెస్ట్, టూరిజం డిపార్ట్మెంట్ల అధ్వర్యంలో ఏర్పాటు చేసిన జంగిల్సఫారీలో విహరిస్తూ కవ్వాల్అందాలను ఆస్వాదించవచ్చు. రెండు డిపార్ట్మెంట్ల నుంచి తొమ్మిది సఫారీ వెహికల్స్ఏర్పాటు చేశారు. ఉదయం 6 నుంచి 10.30 గంటల వరకు, సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు సఫారీ ద్వారా అడవిలో తిప్పుతారు. గోండుగూడ బేస్ క్యాంప్, వాచ్టవర్, బైసన్కుంట, మైసమ్మకుంట, గనిశెట్టికుంటలను చూపిస్తారు. బైసన్కుంట వద్ద చుక్కల దుప్పులు, అడవి దున్నలు గుంపులుగా కనిపిస్తాయి. అక్కడే ఉన్న ఎన్విరాన్మెంటల్ స్టడీ సెంటర్లో జంతువుల ఎముకలు, పుర్రెభాగాలు చూడొచ్చు. దట్టమైన అడవిలో సుమారు 20 కిలోమీటర్లు జంగిల్సఫారీ ఆహ్లాదకరంగా సాగుతుంది. ఈ టూర్మర్చిపోలేని అనుభూతిగా మిగిలిపోతుదంటే అతిశయోక్తి కాదు.
సఫారీ కాస్త ఖరీదే..
జంగిల్ సఫారీ కోసం కొత్త లగ్జరీ వెహికల్స్ ఏర్పాటు చేయడంతో సఫారీ కాస్త ఖరీదుగా మారింది. ఒక్కో వెహికల్లో ఆరుగురు ప్రయాణించవచ్చు. ట్రిప్కు రూ.5వేలు వసూలు చేస్తారు. అదనంగా ఎక్కితే ఒక్కొక్కరికి రూ.500 చెల్లించాలి. వీకెండ్స్లో కవ్వాల్ ఫారెస్ట్కు టూరిస్టుల తాకిడి విపరీతంగా పెరుగుతోంది. హైదరాబాద్, చుట్టుపక్కల ప్రాంతాల నుంచి టూరిస్టులు ఎక్కువగా వస్తున్నారు. పిల్లలు మాత్రం ఫుల్ఎంజాయ్ చేస్తున్నారు. జన్నారంలో టూరిజం డిపార్ట్మెంట్ఆధ్వర్యంలో హరిత కాటేజీలు, రెస్టారెంట్ అందుబాటులో ఉన్నాయి.
సోమవారం నుంచి గురువారం వరకు నాన్ఏసీ రూమ్కు రూ.1,064, ఏసీ రూమ్కు రూ.1,624, డార్మెటరీకి రూ.1,600 చార్జి చేస్తున్నారు. శుక్ర, శని, ఆది వారాల్లో నాన్ఏసీకి రూ.1,176, ఏసీకి 1,792, డార్మెటరీకి రూ.1,800 చెల్లించాలి. వీకెండ్స్లో సందర్శించేవారు వారం ముందే ఆన్లైన్లో రూమ్లు, జంగిల్ సఫారీ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది.