
కాజీపేట, వెలుగు: రైల్వే డ్రైవర్స్ కోసం అత్యాధునిక సౌకర్యంతో నిర్మించిన మోడల్ రన్నింగ్ రూమ్ ను సౌత్ సెంట్రల్ రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్ ప్రారంభించారు. కాజీపేట రైల్వే స్టేషన్ సమీపంలో రూ.7.50 కోట్లతో నిర్మించిన ఈ భవనాన్ని శనివారం ఓపెనింగ్ చేశారు. అనంతరం అరుణ్ కుమార్ మాట్లాడుతూ రైల్వే డ్రైవర్స్ విశ్రాంతి కోసం ఆధునిక టెక్నాలజీ తో రన్నింగ్ రూమ్ నిర్మించినట్లు తెలిపారు.
కాజీపేట రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులు డిసెంబర్ లోగా పూర్తి చేయిస్తామన్నారు. రైల్వే కోచ్ ఫ్యాక్టరీని డిసెంబర్ 25న ఓపెనింగ్ చేయనున్నట్లు తెలిపారు. అనంతరం రన్నింగ్ రూమ్ ఆవరణలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో సికింద్రాబాద్ డీఆర్ఎం బర్తెషు కుమారజైన్, కాజీపేట రైల్వే స్టేషన్ మేనేజర్ అగ్గి రవీందర్ తదితరులు పాల్గొన్నారు.