హైదరాబాద్: సింగరేణి కాలరీస్ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. దసరా పండుగ సందర్భంగా వారికి 30 శాతం బోనస్ ఇవ్వనున్నట్లు ప్రకటించింది. 2021–22 ఏడాదికి గాను సంస్థ లాభాల నుంచి ఉద్యోగులకు 30 శాతం బోనస్ ఇవ్వాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఈ మేరకు సింగరేణి చైర్మన్, ఎండీ, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ నర్సింగరావు ఉత్తర్వులు జారీ చేశారు.
దసరాలోపే అర్హులైన కార్మికులందరికీ బోనస్ చెల్లించాలని ఆదేశించారు. బోనస్ కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.368 కోట్లు కేటాయించిందని ఆయన తెలిపారు.