హుజూరాబాద్ ఎన్నికలను కేసీఆర్ పెద్దగా పట్టించుకోవట్లేదు

హుజూరాబాద్ ఎన్నికలను కేసీఆర్ పెద్దగా పట్టించుకోవట్లేదు
  • మంత్రి గంగుల కమలాకర్

కరీంనగర్: హుజూరాబాద్ ఉప ఎన్నికల గురించి సీఎం కేసీఆర్ పెద్దగా పట్టించుకోవడం లేదని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. బుధవారం హుజరాబాద్ మండలం బోర్నపల్లి దగ్గర రూ. కోట్లతో జరుగుతున్న రోడ్డు నిర్మాణ పనులను మంత్రి గంగుల కమలాకర్ పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల మాట్లాడుతూ మంత్రిగా ఈటల రాజేందర్ హుజురాబాద్ అభివృద్ధిని విస్మరించారని ఆరోపించారు. హుజురాబాద్ లో తాను ఉంటున్న ఇంటికి వెళ్లే దారి కూడా ఈటల రాజేందర్ వేయించలేకపోయారని ఎద్దేవా చేశారు. హుజురాబాద్ ఉప ఎన్నికను కేసీఆర్ పెద్దగా పట్టించుకోవడం లేదని ఈయన స్పష్టం చేశారు.