విద్యా వ్యవస్థను కేసీఆర్ ​భ్రష్టు పట్టించాడు : షబ్బీర్ ​అలీ

విద్యా వ్యవస్థను కేసీఆర్ ​భ్రష్టు పట్టించాడు : షబ్బీర్ ​అలీ

 మాజీ మంత్రి షబ్బీర్​అలీ

కామారెడ్డి, వెలుగు: సీఎం కేసీఆర్​ విద్యా వ్యవస్థను పూర్తిగా భ్రష్టు పట్టించారని మాజీ మంత్రి, కాంగ్రెస్​నేత షబ్బీర్​అలీ విమర్శించారు. కామారెడ్డి డెయిరీ టెక్నాలజీ కాలేజీలో ప్రొఫెసర్​ రాజగోపాల్ ​రిటైర్మెంట్​సందర్భంగా శుక్రవారం కాలేజీలో ప్రోగ్రామ్​ ఏర్పాటు చేశారు. షబ్బీర్​అలీ మాట్లాడుతూ.. గతంలో మన స్టేట్​లోని యూనివర్సిటీలు దేశంలో ఫస్ట్, సెకండ్​ స్థానాల్లో ఉంటే  బీఆర్ఎస్​ ప్రభుత్వం వచ్చాక లిస్టులో లేకుండా పోయాయన్నారు.  

ఉమ్మడి ఏపీలో కొట్లాడి తీసుకొచ్చిన డెయిరీ టెక్నాలజీ కాలేజీ సొంత స్టేట్​లో ఎంతో అభివృద్ధి చెందుతుందని భావించామని, అలా జరగలేదన్నారు. కాలేజీలు, యూనివర్సిటీల్లో లెక్చరర్లు, ప్రొఫెసర్ల కొరత ఉందన్నారు.​ కాలేజీ అభివృద్ధికి ప్రొఫెసర్​రాజగోపాల్ ఎంతో శ్రమించారని, వారి సేవలు ఎనలేనివన్నారు. లీడర్లు చంద్రకాంత్​రెడ్డి,  గొనే శ్రీనివాస్​, చంద్రశేఖర్, సందీప్​పాల్గొన్నారు.