యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయ పునర్నిర్మాణ పనులను సీఎం కేసీఆర్ గురువారం నాడు పరిశీలించారు. గురువారం నాడు హైద్రాబాద్ నుండి రోడ్డు మార్గంలో యాదాద్రికి చేరుకున్న కేసీఆర్ కు అర్చకులు, ఆలయ అధికారులు స్వాగతం పలికారు. అనంతరం సీఎం… ఆలయంలో స్వామిని దర్శించుకొని, తీర్ధప్రసాదాలు స్వీకరించారు.
రెండు గంటల పాటు ఆలయ పునర్నిర్మాణ పనులను సీఎం కేసీఆర్ పరిశీలించారు. ప్రధానాలయ మండపం, క్యూలైన్లు రాజగోపురాలు, మాడ వీధులు, శివాలయాలను పరిశీలించారు. ప్రధాన ఆలయంలో ప్రతి ఘట్టాన్ని చూసి అభినందనలు తెలిపారు. ఆలయ నిర్మాణ పనులు సుమారు 90 శాతానికి పైగా పూర్తయ్యాయని, మిగిలిన పనులను కూడ త్వరలోనే పూర్తి చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు.