కేసీఆర్ కృషితో పుట్లకు పుట్లు ఒడ్లు పండుతున్నయ్

కేసీఆర్ కృషితో పుట్లకు పుట్లు ఒడ్లు పండుతున్నయ్

జనగామ జిల్లా :  సీఎం కేసీఆర్ కృషితో జనగామ జిల్లాలోని ప్రతి పల్లెలో పుట్లకు పుట్లు ఒడ్లు పండుతున్నాయని తెలిపారు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి. శుక్రవారం జనగామ బహిరంగ సభలో మాట్లాడిన పల్లా..జనగామ జిల్లా ఇచ్చి అద్భుతంగా కలెక్టరేట్ కొత్త భవనం కడుతున్న సందర్భంగా సీఎం కేసీఆర్ కు స్వాగతం తెలియజేస్తున్నట్లు తెలిపారు.  జనగామ ప్రాంతం అంటే సీఎంకి చాలా అనుబంధం ఉందన్నారు. ఎంతో మందితో సంబంధాలున్నాయని.. ఈ ప్రాంతం బాధలపై అనేకసార్లు చెప్పుకుని బాధపడ్డారన్నారు. చెన్నూరు, చేర్యాల, స్టేషన్ ఘన్ పూర్ లోనూ టీఆర్ఎస్ గెలిచిందన్నారు. ప్రతి గ్రామంలో మంచినీరు, చెరువులు నిండటంతో పుట్లకు పుట్లు ఒడ్లు పండుతున్నాయన్న పల్లా రాజేశ్వర్ రెడ్డి.. మొదటి నుంచి జయశంకర్ సార్ మీ వెంట ఉండటంతో ఈ ప్రాంతం గురించి కేసీఆర్ కు తెలుసన్నారు. వేదికపై అమరవీరుల స్థూపం, తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేశారు.