ఎంపీపీ కవిత కుమారుడికి కేటీఆర్ పేరు పెట్టిన కేసీఆర్

ఎంపీపీ కవిత కుమారుడికి కేటీఆర్ పేరు పెట్టిన కేసీఆర్

కరీంనగర్ జిల్లా రామడుగు ఎంపీపీ కలిగేటి కవిత - లక్ష్మణ్ దంపతుల కుమారునికి తారక రామారావు అని  పేరు పెట్టారు సీఎం కేసీఆర్. గతంలో కుటుంబ కలహాలతో విడాకులు తీసుకునేందుకు సిద్ధమయ్యారు కవిత, లక్ష్మణ్ జంట.అయితే గత ఎంపీటీసీ ఎన్నికల సందర్భంగా ఇద్దరు కలిసి ఉంటేనే ఎంపీటీసీ టికెట్ ఇస్తామని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్  చెప్పారు.  ఆ తర్వాత మోతే గ్రామ ఎంపీటీసీగా గెలిచిన కవిత.. ఆ తర్వాత రామడుగు ఎంపీపీ ఎన్నికయ్యారు. ఐదు నెలల కిందట కవిత దంపతలకు బాబు జన్మించాడు. ఇవాళ్ల కలెక్టరేట్ లో సీఎం కేసీఆర్ ను కలిసి తమ బాబుకు పేరు పెట్టాలని కోరారు కవిత,లక్ష్మణ్ దపంతులు. దీంతో ఆయన కేటీఆర్ పేరును బాబుకు పెట్టారు.