మోడీతో కేసీఆర్ జోడీ: ఢిల్లీలో సీక్రెట్ గా చర్చ

మోడీతో కేసీఆర్ జోడీ: ఢిల్లీలో సీక్రెట్ గా చర్చ

హైదరాబాద్ : అగ్రి చట్టాలు రైతులకు ఉరితాడులా మారాయన్నారు కాంగ్రెస్ సీనియర్ లీడర్, ఎంపీ రేవంత్ రెడ్డి. మోడీ తెచ్చిన కొత్త అగ్రీ చట్టాలకు వ్యతిరేకంగా బంద్ కు మద్దతిచ్చిన కేసీఆర్.. ఇప్పుడు మోడీ వైపు మాట్లాడుతున్నారన్నారు. ప్రధాని మోడీతో కేసీఆర్ జోడీ కట్టారని.. ఇద్దరి మధ్యన ఢిల్లీలో సీక్రెట్ గా చర్చ జరిగిందన్న ఆయన.. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ కు కాంగ్రెస్ ప్రధాన శత్రువు అన్నారు. ఎన్నికలు వేరు ప్రజా సమస్యలపై పోరు వేరు అన్నారు రేవంత్ రెడ్డి. కేంద్రం తెచ్చిన కొత్త అగ్రి చట్టాలపై దేశంలోని అన్ని పార్టీలు మద్దుతు తెలుపుతుంటే కేసీఆర్ మాత్రం మాట మార్చారన్నారు. ఢిల్లీలో ఏదో జరిగిందంటూ చెప్పుకొచ్చారు రేవంత్ రెడ్డి.