
తొలిసారి కాళేశ్వరం కమిషన్ విచారణ కు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరు కానున్నారు. న్యాయ నిపుణులతో చర్చించిన అనంతరం జూన్ 5న హాజరు కావాలని కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. గతంలో విద్యుత్ కమిషన్ విచారణకు రావాలని నోటీసులు ఇవ్వగా కేసీఆర్ వెళ్లలేదు. ప్రస్తుతం కాళేశ్వరం విచారణకు హాజరు కాకపోతే తప్పుడు సంకేతాలు వెళ్లే అవకాశం ఉన్నందున ఈ సారి విచారణకు హాజరు కావాలని నిర్ణయించుకున్నారు.
ఈ మేరకు ఆయన కాళేశ్వరం నిర్మాణం నుంచి మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజీలకు ద్యామేజీ అయ్యే వరకు జరిగిన పరి ణామాలపై ఫాంహౌస్ లో స్టడీ చేస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే విచారణకు వెళ్లొచ్చిన రిటైర్డ్ ఇంజినీర్లతో వరుసగా భేటీ అవుతున్నా రు.
ALSO READ | జూన్ 2న కవిత కొత్త పార్టీ.. షర్మిల తరహాలో రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర: ఎంపీ రఘనందన్ రావు
లోపాలు ఎక్కడ జరిగాయి.. ఎస్టీఎస్ఏ ఏం చెప్పింది.. విజిలెన్స్ రిపోర్టులో ఏమున్నాయి..? నిర్మాణ సంస్థలు ఎలాంటి సమాచారం ఇచ్చాయి. డిజైన్ లోపాలున్నా యా..? నిర్మాణ సమస్యలా..? ఎందుకలా జరిగింది..? అనే అంశాలపై లోతుగా అధ్య యనం చేస్తున్నట్టు సమాచారం. దేశంలోని వివిధ ప్రాంతాల్లో నిర్మాణంలో ఉన్న, నిర్మాణం పూర్తయిన ప్రాజెక్టులపైనా ఆరా తీస్తున్నారని సమాచారం.
ఇదే తరుణంలో ఇప్పటికే విచా రణకు హాజరైన వారితోనూ మాట్లాడుతున్నా రని తెలుస్తోంది. కమిషన్ ఎలాంటి ప్రశ్నలు అడుగుతోంది.? ఆఫిడవిట్ ఏమని ఇచ్చారని వాకబు చేస్తున్నట్టు తెలుస్తోంది. అప్పట్లో నీటి పారుదలశాఖ మంత్రిగా పనిచేసిన హరీష్ రావుతోనూ కేసీఆర్ భేటీ అయ్యారు. కమిషన్ నోటీసులు జారీ చేసిన తర్వాత రెండు సార్లు వీ ళ్లిద్దరూ ఎర్రపల్లి ఫాంహౌస్ భేటీ అయ్యారు.
కాళేశ్వరం కమిషన్ నోటీసులు అందుకున్న కేసీఆర్ జూన్ 5న జరిగే విచారణకు హాజరు కానున్నారు. విచారణకు వెళ్లే సమయంలో వెన్నంటి ఉండేందుకే కేటీఆర్ ముందస్తుగా అమెరికా వెళ్లారని తెలుస్తోంది. ఇవాళ (మే 27) లండన్, అమెరికా పర్యటనకు వెళ్లిన కేటీఆర్ జూన్ 3వ తేదీన తిరిగి వస్తారని సమాచారం.