జూన్ 2న కవిత కొత్త పార్టీ.. షర్మిల తరహాలో రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర: ఎంపీ రఘనందన్ రావు

జూన్ 2న కవిత కొత్త పార్టీ..  షర్మిల తరహాలో రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర: ఎంపీ రఘనందన్ రావు

మెదక్ ఎంపీ రఘు నందన్ రావు మరోసారి సంచలన కామెంట్స్ చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత జూన్ 2న కొత్త పార్టీ పెట్టబోతోందని అన్నారు. పార్టీ పెట్టి షర్మిల తరహాలో తెలంగాణ వ్యాప్తంగా పాదయాత్ర చేయనుందని అన్నారు. 

మంగళవారం తుఫ్రాన్ లో పర్యటించిన ఎంపీ రఘునందన్ రావు.. బీఆర్ఎస్ లో జరుగుతున్న పరిణామాలపై జోస్యం చెప్పారు. కేసీఆరే కవితతో పార్టీ పెట్టిస్తున్నారని ఈ సందర్భంగా అన్నారు. తండ్రీ కూతుళ్ల మధ్యవర్తులెందుకని ఈ సందర్భంగా విమర్శించారు. 

కేసీఆర్ చుట్టూ దెయ్యాన్నాయన్న కవిత.. పదేళ్లుగా దెయ్యాల మధ్య రాజకీయం ఎందుకు చేయాల్సి వచ్చిందని ప్రశ్నించారు. గెలిచినప్పుడు దేవుడయ్యాడు ఇపుడుదయ్యం అయ్యాడు ఎందుకో చెప్పాలని ఈ సందర్భంగా ప్రశ్నించారు. 

►ALSO READ |  రామగుండంలో రూ.25 కోట్లతో హైవే సర్వీస్​ రోడ్ల విస్తరణ : ఎమ్మెల్యే ఎంఎస్​ రాజ్​ఠాకూర్​

బీఆర్ఎస్ పార్టీలో అంతర్గతంగా జరుగుతున్న వ్యవహారాలపై ఇంతకు ముందు కూడా ఎంపీ రఘునందన్ రావు కామెంట్ చేసిన విషయం తెలిసిందే. కవిత కాంగ్రెస్ లోకి వెళ్తుందని, షర్మిళ తరహాలోనే కవిత కూడా బయటకు వస్తుందని గతంలో వ్యాఖ్యానించిన రఘునందన్ రావు.. ఈ సారి ఏకంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజునే కవిత పార్టీ పెడుతుందని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏదైనా స్పష్టమైన సమాచారం ఉండి చేశారా లేక రాజకీయ విమర్శల్లోనే భాగమా అనేది భవిష్యత్తులో కవిత తీసుకోబోయే నిర్ణయాన్ని బట్టి అర్థమవుతుంది.