
గోదావరిఖని, వెలుగు: రామగుండంలో రాజీవ్రహదారికి పక్కన రూ.25 కోట్లతో సర్వీస్ రోడ్ల విస్తరణ పనులు చేపట్టినట్టు ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ఠాకూర్తెలిపారు. సోమవారం స్థానిక శారదానగర్ వద్ద చేపట్టిన సర్వీస్ రోడ్డు విస్తరణ పనులను ఎమ్మెల్యే స్వయంగా పరిశీలించారు. ఆర్అండ్బీ, సింగరేణి, రామగుండం కార్పొరేషన్ ఇంజినీర్లు, ఇతర ఆఫీసర్లతో కలిసి పనుల పురోగతిని సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రామగుండం హైవే అనేది స్థానిక ప్రజలకు మాత్రమే కాదు, పారిశ్రామిక అవసరాలకు కీలక మార్గమని అన్నారు.
ట్రాఫిక్ భద్రత, వాహనదారుల సౌకర్యం కోసం సర్వీస్ రోడ్ విస్తరణ ఎంతో అవసరమని, పట్టణంలో రవాణా వ్యవస్థను మరింత సులభతరం చేయాలనే ఉద్దేశంతోనే ఈ పనులు చేపట్టినట్టు తెలిపారు. అత్యుత్తమ నాణ్యతతో, నిర్దేశిత సమయంలో పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సింగరేణి ఆర్జీ 1 జీఎం డి.లలిత్ కుమార్, పోలీస్ ఆఫీసర్లు, ఇంజినీర్లు, లీడర్లు పాల్గొన్నారు.