రేపటి మహాధర్నాలో పాల్గొననున్న కేసీఆర్

రేపటి మహాధర్నాలో పాల్గొననున్న కేసీఆర్

రైతుల పక్షాన రేపు టీఆర్ఎస్ ధర్నా చేస్తుందన్నారు మంత్రి హరీష్ రావు. రేపు(గురువారం) ఇందిరాపార్క్ దగ్గర సీఎం కేసీఆర్ తో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు అందరూ హాజరవుతారన్నారు. ఈ సందర్భంగా ధర్నాచౌక్ దగ్గర ఏర్పాట్లను పరిశీలించారు. వడ్ల కొనుగోళ్లపై కేంద్రం మొండివైఖరి వీడాలన్నారు. పంజాబ్ లో కొంటరు...తెలంగాణలో ఎందుకు కొనరని ప్రశ్నించారు మంత్రి హరీష్ రావు. రైతుల కోసమే TRS మహాధర్నా అన్నారు మంత్రులు.  వడ్లు కొనాల్సిన బాధ్యత కేంద్రం మీద ఉందన్నారు.