కామారెడ్డి టౌన్, వెలుగు: కామారెడ్డి జిల్లా కేంద్రంలో అక్రమ లేఆవుట్లపై మున్సిపల్ అధికారులు శుక్రవారం కొరఢా ఝుళిపించారు. పర్మిషన్లు లేకుండా ప్లాట్లుగా మార్చటం, రోడ్లు, డ్రైనేజీల నిర్మాణం చేపట్టగా వాటిని జేసీబీలతో తొలగించారు.
వికాస్నగర్ కాలనీ సమీపంలో సర్వే నంబర్లు 672, 675, 676, 677, 678లోని 3 ఎకరాల 39 గుంటల్లో లేఆవుట్చేస్తున్నారని మున్సిపల్కమిషనర్ ముత్యాలు పేర్కొన్నారు. పర్మిషన్ లేకపొవటంతో నోటీసులు ఇచ్చామని, అయినప్పటికీ పనులు చేస్తుండటంతో చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. పోలీసు బందోబస్తు మధ్య వెంచర్లో వేసిన రోడ్లు, డ్రైనేజీలను ధ్వంసం చేశారు.
