మంత్రి ప్రశాంత్​ రెడ్డికి మాతృవియోగం..అంత్యక్రియలకు కేసీఆర్

మంత్రి ప్రశాంత్​ రెడ్డికి మాతృవియోగం..అంత్యక్రియలకు కేసీఆర్

హైదరాబాద్/నిజామాబాద్, వెలుగు : మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తల్లి మంజులమ్మ (80) కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా సోమాజిగూడలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ గురువారం మధ్యాహ్నం మృతి చెందారు.  ఏడాది కాలంగా మంజులమ్మ అన్యారోగ్యంతో ఇబ్బంది పడుతున్నారు. తల్లి మరణవార్త విన్న మంత్రి ఒక్కసారిగా కుప్పకూలారు. కాగా శుక్రవారం ఉదయం బాల్కొండ నియోజకవర్గంలోని మంత్రి స్వస్థలమైన వేల్పూర్​మండల కేంద్రంలో మంజులమ్మ అంత్యక్రియలు జరగనున్నాయి. అంత్యక్రియలకు సీఎం కేసీఆర్ హాజరుకానున్నారు.

 జిల్లా అధికారులకు సమాచారం వెళ్లటంతో ఏర్పాట్లు చేస్తున్నారు. మంజులమ్మ మృతి వార్త తెలుసుకుని సీఎం కేసీఆర్, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ సంతాపం తెలిపారు. గత కొంత  కాలంగా వైరల్ ఫీవర్ తో బాధపడుతున్న సీఎం.. శుక్రవారం వేల్పూర్​ వెళ్లనున్నారు. మంత్రి ప్రశాంత్ రెడ్డి తండ్రి వేముల సురేందర్ రెడ్డి, సీఎం కేసీఆర్ అత్యంత సన్నిహితులు. సురేందర్ రెడ్డి అంత్యక్రియలకు సైతం కేసీఆర్ హాజరయ్యారు.