హైదరాబాద్ సిటీ, వెలుగు: సనత్నగర్ టిమ్స్ హాస్పిటల్లో ఔట్సోర్సింగ్ విధానంలో ఆరోగ్య మిత్ర పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు రాజీవ్ ఆరోగ్యశ్రీ జిల్లా కోఆర్డినేటర్ డా.సాయినారాయణ గౌడ్ తెలిపారు. గ్రాడ్యుయేషన్, డీసీఏ అర్హత ఉన్నవారు నెలకు రూ.19,500 వేతనానికి అర్హులని పేర్కొన్నారు.
ఆసక్తి గల అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లతో ఈ నెల 21న ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సికింద్రాబాద్ పాట్నీ సెంటర్ హరిహర కళాభవన్ ఎదురుగా ఉన్న ఎన్టీపీసీ భవనం 4వ అంతస్తులోని డీఎంహెచ్ఓ ఆఫీసులో జరిగే వాక్- ఇన్ ఇంటర్వ్యూకు హాజరుకావాలన్నారు. 22 నుంచి 25 వరకు సర్టిఫికెట్ల పరిశీలన, 27-, 28న అభ్యంతరాల స్వీకరణ, 31 నుంచి సెప్టెంబర్ 1 వరకు ఎంపిక జాబితా ప్రదర్శిస్తామని తెలిపారు. నియామకాలు కలెక్టర్ ఆదేశాల ప్రకారం జరుగుతాయని పేర్కొన్నారు.
