సందీప్ కిషన్ ‘సిగ్మా’ మూవీ కొత్త రిలీజ్ డేట్ అనౌన్స్

సందీప్ కిషన్ ‘సిగ్మా’ మూవీ కొత్త రిలీజ్ డేట్ అనౌన్స్

సందీప్ కిషన్ హీరోగా కోలీవుడ్ స్టార్ హీరో,  ప్రస్తుత తమిళనాడు సీఎం విజయ్ కొడుకు సంజయ్ జాసన్ దర్శకుడిగా రూపొందిస్తున్న చిత్రం ‘సిగ్మా’.  లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌‌‌‌‌‌‌‌పై సుభాస్కరన్ నిర్మిస్తున్నారు. యాక్షన్ అడ్వెంచర్ కామెడీగా తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో ఫరియా అబ్దుల్లా హీరోయిన్‌‌‌‌గా నటిస్తోంది. ఇటీవల షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. తాజాగా ఈ మూవీ కొత్త రిలీజ్ డేట్‌‌‌‌ను ప్రకటించారు.

వాస్తవానికి ఈ చిత్రాన్ని జులై 31న విడుదల చేయాలనుకున్నారు. కానీ వర్క్ కంప్లీట్ కాకపోవడంతో తాజాగా ఈ చిత్రాన్ని  అక్టోబర్ 2న విడుదల చేయనున్నట్టు అనౌన్స్ చేశారు. గాంధీ జయంతి సెలవుతో పాటు వీకెండ్,  దసరా సీజన్ ఈ సినిమాకు ప్లస్ అవుతుందని మేకర్స్ భావిస్తున్నారు.