
వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల నిరుద్యోగుల పక్షాన పోరాటం మొదలుపెట్టారు. అఖిల పక్షాలన్నీ ఏకమై ఉమ్మడిగా పోరాటం చేయాలని పిలుపు నిచ్చారు. దానికోసం సోమవారం షర్మిల మొదలుపెట్టిన టీ-సేవ్ అనే కార్యక్రమానికి అఖిల పక్షాలు హాజరయ్యాయి. ఈ కార్యక్రమంలో మాట్లాడిన షర్మిల.. రాష్ట్ర ప్రభుత్వ పని తీరుపై మండిపడ్డారు. నిరుద్యోగుల సమస్యలపై పట్టించుకోని సర్కారుపై అసంతృప్తి వ్యక్తం చేశారు.
రాష్ట్ర ప్రభుత్వ వైఖరి వల్ల తెలంగాణ నిరుద్యోగులకు, విద్యార్థులుకు తీవ్ర నష్టం జరుగుతోంది షర్మిల అన్నారు. ఫీ రియంబర్స్ మెంట్, ఉద్యోగాల భర్తీ, యూనివర్సిటీల్లో వసతుల కల్పనకు ఫోరమ్ పోరాటం చేస్తోందని వెల్లడించారు. 1లక్ష 91 వేల ఉద్యోగ ఖాళీగా ఉన్నాయని పిఆర్సీ కమిషన్ చెప్పుంటే.. కేసీఆర్ మాత్రం కేవలం 80 వేల ఖాళీలు ఉన్నాయని చెప్తున్నారని మండిపడ్డారు.
కేసీఆర్ మెడలు వంచాలంటే అఖిల పక్షాలన్నీ ఒకటి కావాలని, రాష్ట్ర ప్రభుత్వంపై పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. ఐక్య వేదిక, ఉమ్మడి కార్యాచరణ ఖరారు చేయాలని కోరారు. ఈనెల 17 న ఒక వేదికపై 24 లేదా 48 గంటలు నిరాహార దీక్ష చేసేందుకు షర్మిల సిద్దం అయ్యారు. ప్రగతి భవన్ ను ముట్టడి చేసి రోజుంత అక్కడే కూర్చోవాలని నిర్ణనించారు.