తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‎లో కీరవాణి కచేరి

తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‎లో కీరవాణి కచేరి

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న ‘‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌2025’’లో అస్కార్ అవార్డు గ్రహిత, ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి తన సంగీత కచేరితో అలరించనున్నారు. భారత్ ఫ్యూచర్ సిటీలో 2025, డిసెంబర్ 8న ప్రారంభమయ్యే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌లో పాల్గొనే ప్రపంచ ప్రతినిధులకు భిన్న సాంస్కృతిక, కళారూపాలు అతిథులను అలరించనున్నాయి. ఈ సమ్మిట్‎లో 90 నిమిషాల పాటు కీరవాణి ప్రత్యేక సంగీత కచేరి ఉంటుంది. 

ప్రముఖ వీణా విద్యాంసురాలు పి. జయలక్ష్మీ వీణా కార్యక్రమం, కళా కృష్ణ ఆధ్వర్యంలో పేరణి నాట్యం అతిథులకు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. ప్రముఖ ఇంద్రజాల మాంత్రికుడు సామల వేణు తన  ప్రదర్శనతో ప్రేక్షకులను ఆకట్టుకోనున్నారు. వీటితో తెలంగాణ సంప్రదాయ కళా రూపాలు సందడి చేయనున్నాయి.

తెలంగాణ రాష్ట్ర సంస్కృతి కళలను ప్రతిబించేలా కొమ్ము కోయ, బంజారా, కోలాటం, గుస్సాడి, ఒగ్గు డోలు, మహిళల డప్పులు, పేరణి నృత్యం, బోనాల కోలాటం వంటి ప్రజా కళారూపాలతో అతిథులను ఆత్మీయంగా ఆహ్వానించనున్నారు. డిసెంబర్ 10 నుంచి 13 తేదీ వరకు ఈ  వేడుకలను ప్రజలందరూ చూసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నాలుగు రోజులు రోజంతా మ్యూజికల్ ఆర్కెస్ట్రా నిర్వహిస్తారు.