ఢిల్లీ సరిహద్దు ప్రాంతాలు మూసివేత

ఢిల్లీ సరిహద్దు ప్రాంతాలు మూసివేత

పౌరసత్వ సవరణ చట్టం(CAA) అనుకూల,వ్యతిరేక వర్గాల మధ్య ఘర్షణతో ఢిల్లీలో చెలరేగిన హింసను అణచివేసేందుకు ఆ రాష్ట్ర సీఎం అరవింద్ కేజ్రీవాల్ చర్యలు చేపట్టారు. బయటి నుంచి విద్రోహ శక్తులు దేశ రాజధానిలోకి వచ్చి హింసకు పాల్పడుతున్నాయని … ఢిల్లీ సరిహద్దు ప్రాంతాలను కొంతకాలం మూసివేయాలని నిర్ణయించారు కేజ్రీవాల్. అంతేకాదు రాష్ట్రంలో శాంతి నెలకొల్పేందుకు కేంద్రం నుంచి అన్ని విధాలుగా సహయం అందిస్తామని అమిత్ షా హామీ ఇచ్చారని చెప్పారు.

ఈశాన్య ఢిల్లీలో సోమవారం(నిన్న) చెలరేగిన హింసలో ఓ పోలీస్ కానిస్టేబుల్ సహా ఏడుగురు చనిపోగా..దాదాపు వంద మంది గాయపడ్డారు. అయితే, ఉన్నతాధికారుల నుంచి స్పష్టమైన ఆదేశాలు రాకపోవడంతో పోలీసులు హింసను అడ్డుకోలేకపోయారని సీఎం కేజ్రీవాల్ చెప్పారు. దీనికి సంబంధించి తనకు నివేదిక వచ్చిందని చెప్పారు. పై నుంచి ఉత్తర్వులు రాకపోవడంతో ఆందోళనకారులపైకి బాష్పవాయువు ప్రయోగించాలో, లాఠీచార్జ్ చేయాలో పోలీసులు తేల్చుకోలేకపోయారని చెప్పారు. ఇదే విషయాన్ని తాను అమిత్ షా దృష్టికి తీసుకెళ్లనున్నట్లు కేజ్రీవాల్ తెలిపారు.

అంతేకాదు ఢిల్లీ సరిహద్దును కొంతకాలం మూసివేయాల్సిన అవసరం ఉందని తెలిపారు కేజ్రీవాల్.