లాక్ డౌన్‌ కొనసాగించాలంటూ ప్రధానిని కోరిన ఢిల్లీ సీఎం

లాక్ డౌన్‌ కొనసాగించాలంటూ ప్రధానిని కోరిన ఢిల్లీ సీఎం

మరో రెండు వారాలపాటు దేశంలో లాక్ డౌన్‌ కొనసాగించాలని ప్రధాని మోడీని కోరారు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్. శనివారం ఆయన  ప్రధానితో భేటీ అయ్యారు. ఇందులో భాగంగా లాక్ డౌన్‌పై  కేంద్రం తీసుకునే నిర్ణయాన్ని ఢిల్లీ ప్రభుత్వం ఫాలో అవుతుందని తెలిపారు. మరో రెండువారాల పాటు లాక్ డౌన్ ఉంచినట్టయితే కరోనా తీవ్రత తగ్గే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. తబ్లిగీతో సంబంధమున్న వ్యక్తుల లిస్ట్ ను ఫైనల్ చేస్తున్నామని అన్నారు.

ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్ నగరంలోని పలు వీధులను అనుకోకుండా విజిట్ చేశారు. లాక్ డౌన్ ను ఎవరైనా అతిక్రమిస్తున్నారా అని తెలుసుకున్నారు. అజాద్‌పూర్ మండి, ఏసియా లార్జెస్ట్ ప్రూట్ మార్కెట్, హోల్ సెల్ వెజిటెబుల్ మార్కెట్ ఏరియాలలో ఆయన పర్యటించారు. లాక్ డౌన్ వేల ఢిల్లీ ప్రజలకు వెజిటెబుల్స్ కొరత లేకుండా చూస్తున్నారు. దీంతో పాటు 20కిలోమీటర్ల దూరంలో ఉన్న ఘాజీపూర్ పోల్ట్రీ మార్కెట్ ను కూడా ఆయన పరిశీలించారు.

శనివారం పొద్దుట వరకు ఢిల్లీలో 860 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇందులో అత్యధికంగా తబ్లగీతో సంబంధం ఉన్న వాళ్లే ఉన్నట్లు తెలిపారు అధికారులు.