ఇస్రో మాజీ శాస్త్రవేత్త నంబి నారాయణన్‌కు రూ.1.30 కోట్లు

ఇస్రో మాజీ శాస్త్రవేత్త నంబి నారాయణన్‌కు రూ.1.30 కోట్లు

ఇస్రో మాజీ శాస్త్రవేత్త నంబి నారాయణన్‌ ను తప్పుడు గూఢచర్యంలో ఇరికించిన వ్యవహారంలో సుమారు 36 ఏళ్ల తర్వాత కేరళ ప్రభుత్వం పొరపాటును గ్రహించింది. ఆ పొరపాటకు మూల్యం చెల్లించుకుంది. నిర్దోషి అయినకు రూ.1.30 కోట్లు నష్టపరిహారంగా చెల్లించింది.  గతేడాది రాష్ట్ర మంత్రివర్గం ఈ నిర్ణయం తీసుకోగా, ఆ నిర్ణయాన్ని ఇప్పుడు అమలు చేసింది. నారాయణన్‌ను 1994లో తప్పుడు గూఢచర్యం కేసులో ఇరికించింది.

1994లో భారత దేశపు క్రయోజనిక్ ఇంజిన్ ప్రోగ్రాం రహస్య సమాచారాన్ని నంబి నారాయణన్‌తో పాటు మరొక శాస్త్రవేత్త.. రష్యా, పాక్‌లకు అమ్మినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలో వారిపై అదే సంవత్సరంలో కేసు పెట్టి అరెస్ట్ చేశారు. అయితే తనను అరెస్టు చేసినందుకు నష్టపరిహారం చెల్లించాలని కేరళ రాష్ట్ర ప్రభుత్వంపై నంబి నారాయణన్ తిరువనంతపురం సబ్ కోర్టులో కేసు వేశారు. ఈ కేసులో ప్రభుత్వం నారాయణన్‌తో రాజీ కుదుర్చుకుంది. తర్వాత ఆయన కేసును ఉపసంహరించుకున్నారు.

ఈ కేసులో ఆయనను అనవసరంగా అరెస్టు చేసి, వేధించారని, మానసిక వేదనకు గురి చేశారని సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కేరళ పోలీసుల పాత్రపై దర్యాప్తుకు ఆదేశించింది.

మరోవైపు గతంలో సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా రూ.50 లక్షలు, జాతీయ మానవ హక్కుల కమిషన్ ఆదేశాలతో రూ.10 లక్షలు చెల్లించింది. కాగా, కేరళ ప్రభుత్వం ప్రస్తుతం చెల్లించిన రూ.1.30 కోట్లు గతంలో చెల్లించిన పరిహారానికి అదనం.