కేరళలో పినరయి విజయన్ సర్కార్ కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ ఉద్యోగం చేసే ఏ ఉద్యోగి కూడా యూ ట్యూబ్ ఛానల్ ను నడపరాదని ఆదేశాల్లో పేర్కొంది. ఎవరైనా యూట్యూబ్ ఛానళ్లు నిర్వహిస్తే మూసేయాలని ఆదేశించింది.
యూట్యూబ్ చానల్ నిర్వహణకు అనుమతి కోరుతూ అగ్నిమాపక సిబ్బంది చేసిన విజ్ఞప్తి నేపథ్యంలో ప్రభుత్వం ఈ ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ ఉద్యోగులు యూట్యూబ్ చానళ్లు ప్రారంభించేందుకు అనుమతి ఇవ్వడం సాధ్యం కాదని ఆ జీవోలో పేర్కొంది. ఉద్యోగులు ఎవరైనా యూట్యూబ్ ఛానల్స్ నిర్వహిస్తే అది ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన కిందకు వస్తుందని జీవోలో పేర్కొంది. ఉద్యోగులు ఎవరిరైనా ఇప్పటికే యూట్యూబ్ చానళ్లు ఉంటే మూసేయాలని సూచించింది.