అయోధ్య బాలరాముడ్ని .. దర్శించుకున్న దక్షిణాఫ్రికా క్రికెటర్

అయోధ్య బాలరాముడ్ని ..  దర్శించుకున్న దక్షిణాఫ్రికా క్రికెటర్

ఐపీఎల్ 2024 సీజన్‌కు ముందు దక్షిణాఫ్రికా స్పిన్నర్ కేశవ్ మహారాజ్  అయోధ్యలోని రామమందిరాన్ని సందర్శించాడు.  ఐపీఎల్‌-2024లో లక్నో సూపర్‌ జెయింట్స్‌కు మహారాజ్‌ ప్రాతినిథ్యం వహించనున్నాడు.  లక్నో సూపర్ జెయింట్స్ క్యాంప్‌లో చేరిన తర్వాత మార్చి 21 గురువారం రోజున  అయోధ్యలోని బాలరాముడ్ని దర్శించుకున్నాడు.  

తన ఇన్‌స్టాగ్రామ్‌లో రామమందిరంలో ఉన్న ఫోటోను మహారాజ్  పోస్ట్ చేశాడు. "జై శ్రీ రామ్, అందరికీ దీవెనలు" అంటూ రాసుకోచ్చాడు.   కాగా భారత సంతతికి చెందిన కేశవ్‌ మహారాజ్‌ ..  తాను రాముడికి పెద్ద భక్తుడిని అని ఇంతకు ముందే వెల్లడించారు. రామమందిరాన్ని సందర్శించేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు మహరాజ్ ఈ ఏడాది ప్రారంభంలో స్పోర్ట్స్ టాక్‌తో చెప్పారు. 

ALSO READ ;IPL 2024: రేపటి నుంచే ఐపీఎల్ సంగ్రామం.. కొత్త రూల్స్ ప్రవేశపెట్టిన బీసీసీఐ

కాగా ఈ ఏడాది జనవరి 22న అయోధ్యలో భవ్య రామ మందిరంలో బాల రాముడి ప్రతిష్టాపన జరిగిన విషయం తెలిసిందే. ఇక ఐపీఎల్ 2024 సీజన్‌లో లక్నో తన మొదటి మ్యాచ్ ను  మార్చి 24న రాజస్థాన్ రాయల్స్‌తో  ఆడనుంది.