బీజేపీకి పల్లపు గోవర్ధన్ ​రాజీనామా..బీఆర్ఎస్ లో చేరనున్నట్లు వెల్లడి

బీజేపీకి పల్లపు గోవర్ధన్ ​రాజీనామా..బీఆర్ఎస్ లో చేరనున్నట్లు వెల్లడి

హైదరాబాద్,వెలుగు : ఖైరతాబాద్ సెగ్మెంట్ కు చెందిన బీజేపీ సీనియర్ నేత పల్లపు గోవర్ధన్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా వ్యవహరించే ఆయన ఖైరతాబాద్ టికెట్ ఆశించారు.  ఖైరతాబాద్ టికెట్ మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డికి కేటాయించడంతో గోవర్ధన్ తీవ్ర నిరాశకు గురయ్యారు. వడ్డెర సామాజిక వర్గానికి చెందిన బలమైన బీసీ నేతగా గోవర్ధన్​ పేరు పొందారు.

గురువారం బీజేపీకి రాజీనామా చేసిన ఆయనను మంత్రులు హరీశ్​రావు, కేటీఆర్ బీఆర్ఎస్​లోకి ఆహ్వానించారు. శుక్రవారం భారీ ర్యాలీతో వెళ్లి తెలంగాణ భవన్​లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్​లో చేరనున్నట్టు పల్లపు గోవర్ధన్ తెలిపారు. ఆయన అనుచరులు సైతం గులాబీ పార్టీలో చేరనున్నారు. ఎన్నికల్లో నాలుగైదు సీట్లు గెలిచేందుకే బీసీ సీఎం నినాదంతో  బలహీన వర్గాలను బీజేపీ మోసం చేస్తుందని గోవర్దన్​ ఆరోపించారు.